చార్జింగ్‌ స్టేషన్లకు రూ.800 కోట్లు | Centre gives Rs 800 crore to oil companies for setting up over 7000 charging stations | Sakshi
Sakshi News home page

చార్జింగ్‌ స్టేషన్లకు రూ.800 కోట్లు

Mar 29 2023 1:28 AM | Updated on Mar 29 2023 1:28 AM

Centre gives Rs 800 crore to oil companies for setting up over 7000 charging stations - Sakshi

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్‌ ఇండియా స్కీమ్‌ ఫేజ్‌–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్‌ సెంటర్లలో 7,432 చార్జింగ్‌ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి.

ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్‌ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్‌ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్‌ స్టేషన్స్‌ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్‌ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement