వెన్నెల జలపాతం వెలవెల | - | Sakshi
Sakshi News home page

వెన్నెల జలపాతం వెలవెల

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

మణుగూరు రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో వానలు ఆశించినంతగా లేకపోవడంతో రథంగుట్టపై నుంచి హనుమాన్‌ ఆలయం ఎదురుగా ఉన్న వెన్నెల జలపాతం, రాయిగూడెం వద్ద ఉండే సంపంగి జలపాతాలు వెలవెలబోతున్నాయి. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలకు రథంగుట్టలపై నుంచి జాలువారే జలపాతాలకు మణుగూరు ప్రజలు తడిసి ముద్దయ్యేవారు. చుట్టూ చెట్లు, ఎత్తైన రథంగుట్ట, పక్షుల కిలకిల రావాలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పగోడాలు, ఇతర సౌకర్యాలతో జలపాతం వద్ద సేదతీరేవారు. సెలవు రోజుల్లో, సాయంత్రాలు రద్దీ బాగానే ఉండేది. ఈ ఏడాది వర్షాలు లేకపోవంతో ప్రజల, ప్రకృతి ప్రేమికుల రాకపోకలులేక కళ తప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement