
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివా రికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజ లు చేశారు.
నేడు డిప్యూటీ సీఎం,
మంత్రి పొన్నం పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/మధిర/ఖమ్మం వ్యవసాయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సామగ్రితో సహా సిబ్బంది చేరుకునేలా సమకూర్చిన విద్యుత్ అంబులెన్స్లను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరిస్తారు. ఆతర్వాత మధ్యాహ్నం 12–30గంటలకు బోనకల్ మండలం జానకీపురం సబ్స్టేషన్లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను ఆవిష్కరిస్తారు. ఇక రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం 10–30 గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో పలు పథకాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత మధిరలో నిర్మించే నూతన బస్టాండ్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం శంకుస్థాపన చేయనున్నారు.
ప్రారంభమైన
టీజీ ఈసెట్ కౌన్సెలింగ్
ఖమ్మంసహకారనగర్: పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేలా నిర్వహించిన తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈమేరకు అర్హత సాధించిన విద్యార్థులకు ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో మంగళవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు 105 మంది స్లాట్ బుక్ చేసుకోగా, 102 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని ప్రిన్సి పాల్ జాకీరుల్లా తెలిపారు. కౌన్సెలింగ్ 19వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు.