పల్లె చూపు.. పోరు వైపు | - | Sakshi
Sakshi News home page

పల్లె చూపు.. పోరు వైపు

Jun 18 2025 3:49 AM | Updated on Jun 18 2025 3:51 AM

22 మండలాల పరిధిలో..

జిల్లాలో 22 గ్రామీణ మండలాలు ఉండగా, వీటి పరిధిలో ప్రస్తుతం 471 గ్రామపంచాయతీలు, 4,168 వార్డులు, 22 జెడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు మూడు విడుతలుగా ఎన్నికల నిర్వహిస్తారని తెలుస్తోంది. మొదట విడతలో 8 మండలాలు, రెండు, మూడు విడతల్లో ఏడు మండలాల చొప్పున ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తయింది. సర్పంచ్‌లకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లను సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండనందున.. సర్పంచ్‌ అభ్యర్థులకు 20, వార్డు సభ్యులకు 10 చొప్పున స్వతంత్ర గుర్తులను కేటాయించారు.

చుంచుపల్లి: వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గ సహచరులకు సూచించడంతో అందరి దృష్టీ ఎన్నికల వైపు మళ్లింది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, ఆ తరువాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటరు జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, బ్యాలెట్‌ బాక్స్‌ల మరమ్మతుల పనులు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తి చేసి వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రెయినీలు.. జిల్లాలో విధులు నిర్వహించే ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ పూర్తి చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లే కొనసాగిస్తారా.. కొత్తవి ప్రకటిస్తారా అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

భద్రాచలం, సారపాకకూ ఎన్నికలు..

భద్రాచలం, సారపాకను కలిపి మున్సిపాలిటీగా మార్చాలనే యోచనతో 2018లో ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అయితే గిరిజన సంఘాల వారు కోర్టును ఆశ్రయించగా ఆ ప్రతిపాదన విరమించుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఒక్కో పంచాయతీని మూడుగా విభజించాలని బీఆర్‌ఎస్‌ హయాంలో చట్టం చేశారు. దాన్ని సైతం పలువురు వ్యతిరేకించగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పంచాయతీల్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుతం యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంకా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆమోదానికి పంపిన మరో 10 కొత్త పంచాయతీలపై స్పష్టత రావాల్సి ఉంది. అటు కార్పొరేషన్‌లోకి వెళ్లిన సుజాతనగర్‌ మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు వరసగా ఎన్నికలు రానుండగా గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం

జిల్లాలో స్థానిక సంస్థలతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, బ్యాలెట్‌ బాక్స్‌లు ఇప్పటికే రెడీ చేశాం. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి తొలి విడత శిక్షణ ఫిబ్రవరిలోనే పూర్తిచేశాం. – ఎం.విద్యాచందన,

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

ప్రాదేశిక సమరానికి సమాయత్తం

వచ్చే నెలలో ‘స్థానిక’ ఎన్నికలకు అవకాశం

గ్రామాల్లో మొదలైన సందడి

జిల్లాలోని స్థానిక సంస్థల వివరాలు..

జెడ్పీటీసీ స్థానాలు : 22 గ్రామపంచాయతీలు : 471

ఎంపీటీసీ స్థానాలు : 236 వార్డుల సంఖ్య : 4,168

పోలింగ్‌ కేంద్రాలు : 1,279 పోలింగ్‌ కేంద్రాలు : 4,200

పల్లె చూపు.. పోరు వైపు1
1/2

పల్లె చూపు.. పోరు వైపు

పల్లె చూపు.. పోరు వైపు2
2/2

పల్లె చూపు.. పోరు వైపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement