గనుల్లో రక్షణ చర్యలపై ఆరా.. | - | Sakshi
Sakshi News home page

గనుల్లో రక్షణ చర్యలపై ఆరా..

Jun 18 2025 3:49 AM | Updated on Jun 18 2025 3:49 AM

గనుల్లో రక్షణ చర్యలపై ఆరా..

గనుల్లో రక్షణ చర్యలపై ఆరా..

కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన డీజీఎంఎస్‌ బృందం

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి బొగ్గు గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు పాటిస్తున్నారని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ(డీజీఎంఎస్‌) అధికారులు ఆరా తీశారు. గనుల్లో రక్షణ, భద్రతా చర్యలపై గురువారం కొత్తగూడెం ఏరియాలో నిర్వహించనున్న ఇంటరాక్టివ్‌ సెక్షన్‌లో పాల్గొనేందుకు వారు మంగళవారమే చేరుకున్నారు. స్థానిక ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారా యణరావు వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్‌ బృందానికి నేతృత్వం వహించిన టి.ఆర్‌.కన్నన్‌ మాట్లాడుతూ.. గనుల్లో ఇటీవల ఏమైనా ప్రమాదాలు జరిగాయా.. నివారణకు కంపెనీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితెలుసుకున్నారు. ఆ తర్వాత ఏరి యాలోని పలు గనులు, డిపార్ట్‌మెంట్లలో పర్యటించి రక్షణ చర్యలను పరిశీలించారు. కార్యక్రమంలో మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఎస్‌ఓటు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సనత్‌కుమార్‌, ఇతర డైరెక్టర్లు దిలీప్‌ కుమార్‌, కమలేష్‌, కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాల జీఎంలు శాలేంరాజు, వి.కృష్ణయ్య, సేఫ్టీ జీఎం శ్రీనివాస్‌రావుతో పాటు వివిధ విభాగాల అధికారులు కె.జి.తివారీ, దామోదర్‌రావు, కోటిరెడ్డి, వెంకటేశ్వరరావు, జి.వి.మోహన్‌రావు, గోవర్దన్‌, హరీష్‌, సయ్యద్‌ ఖలీల్‌, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement