
మాతా శిశు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు పక్కగా అమలు చేయాలని, మాతా శిశు ఆరోగ్యాలపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని, వీటిని వైద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్. జయలక్ష్మి మాట్లాడుతూ పోషకాహార కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో డాక్టర్ మధువరణ్, డాక్టర్ తేజశ్రీ, ప్రోగ్రామ్ అధికారులు పి.స్పందన, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.