ఏపీ టాక్స్‌ బార్‌ అధ్యక్షుడిగా రామరాజు శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

ఏపీ టాక్స్‌ బార్‌ అధ్యక్షుడిగా రామరాజు శ్రీనివాసరావు

Jun 17 2025 5:05 AM | Updated on Jun 17 2025 5:05 AM

ఏపీ టాక్స్‌ బార్‌ అధ్యక్షుడిగా  రామరాజు శ్రీనివాసరావు

ఏపీ టాక్స్‌ బార్‌ అధ్యక్షుడిగా రామరాజు శ్రీనివాసరావు

గుంటూరు వెస్ట్‌ : ఏపీ టాక్స్‌ బార్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన ప్రముఖ ఆడిటర్‌ రామరాజు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు ఎం.వి.జె.కె. కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 15న జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జూలై 1 నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఈ పదవిలో రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతారన్నారు. 2000 పైగా ప్రాక్టీషనర్స్‌, చార్డెర్డ్‌ అక్కౌంటెంట్స్‌, న్యాయవాదులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు గతంలో ఏపీ టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌, కన్సల్టెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ ( సదరన్‌ ) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారన్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం సంస్థకు ఎంతో ప్రయోజనమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు కోట సునీల్‌, ఏ.వి.ఎస్‌. కృష్ణ మోహన్‌, చక్ర రమణ, ఫణి కుమార్‌, సురేష్‌లతోపాటు పలువురు ఆడిటర్లు, చార్టెర్డ్‌ అక్కౌంటెంట్లు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement