
‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ఏడాది పాలనలో అభివృద్ధి అడ్రెస్ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు అన్నారు. పర్చూరు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని పావులూరు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్ల ఆధ్వర్యంలో సీనియర్ పార్టీ నాయకులు పాల్గొనగా పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతేడాదిగా రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోందని, అన్యాయం, అక్రమం, వివక్ష, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప న్యాయం, పారదర్శకత, ఎక్కడా కన్పించడం లేదన్నారు. ప్రజలకు చంద్రబాబు మోసపూరిత హామీ లిచ్చి వాటిని అమలు చేయలేక వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు, మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి, చినగంజాం కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అయేషా బుడే, హరిరామి రెడ్డి, చౌదరి, కోటి శ్రీరాములు పాల్గొన్నారు.