విజయకీలాద్రిపై శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటలకు సకల విద్యాప్రాప్తికై హయగ్రీవ హోమం, అర్చన, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.


