సముద్రంలోకి తాబేలు పిల్లలు విడుదల | - | Sakshi
Sakshi News home page

సముద్రంలోకి తాబేలు పిల్లలు విడుదల

Apr 4 2025 1:08 AM | Updated on Apr 4 2025 1:08 AM

సముద్రంలోకి తాబేలు పిల్లలు విడుదల

సముద్రంలోకి తాబేలు పిల్లలు విడుదల

వేటపాలెం: మండలం పరిధిలోని రామాపురం సముద్రతీరంలో అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్‌, ఐటీసీ బంగారు భవిష్యత్‌ సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల రక్షణ కేంద్రం నుంచి 404 పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదుగా గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ రకపు తాబేళ్లను సంరక్షించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు. జిల్లా అటవీ శాఖాధికారి ఎల్‌.భీమయ్య మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6 సముద్ర తాబేళ్లు రక్షణ కేంద్రాలు ఉన్నాయని గుర్తుచేశారు.

దాదాపు 145 తాబేళ్లు 15 వేల గుడ్లు పెట్టగా, కృత్రిమంగా పొదిగించి సముద్రంలోకి పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. చీరాల నియోజకవర్గం పరిధిలో రామచంద్రాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం, రామాపురం గ్రామాలలో ఈ కేంద్రాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శవనం చంద్రారెడ్డి, ఐటీసీ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సూరజ్‌ ప్రదాన, మాజీ సర్పంచ్‌ జంగిలి రాములు, రామాపురం గ్రామస్తులు సున్నపు సుబ్బారావు, రజని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement