భక్తిశ్రద్ధలతో హజరత్‌ పీరుల్లా మాలిక్‌ గంధోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో హజరత్‌ పీరుల్లా మాలిక్‌ గంధోత్సవం

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

పలు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు

దర్గా అంతటా పూల కళ

దర్గా ఆవరణలో భక్తుల సందడి

విద్యుద్దీప వెలుగులో పెద్దదర్గా ప్రవేశ ద్వారం

కడప సెవెన్‌రోడ్స్‌ : దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా పేరు గాంచిన కడప పీరుల్లామాలిక్‌ దర్గా మరోమారు తన విశిష్ఠతను చాటుకుంది. దర్గా గురువులు హజరత్‌ పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ సజీవ సమాధి అయిన సందర్భంగా ఏటా ఈ ఉరుసును వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ మారు కూడా ఉరుసును రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా దర్గా అంతటా విద్యుద్దీపాలు అలంకరించారు. ముఖ్యంగా దర్గాలోని గురువుల మజార్‌ ప్రాంతాన్ని పూర్తిగా రంగురంగుల పూలతో అలంకరించారు. దర్గా ప్రాంగణమంతా పూల పరిమళం నిండి భక్తులను మైమరిపించింది. ఈ సందర్భంగా ఉద యం దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ గంధం సమర్పించి ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ప్రధాన గురువుల మజార్‌ వద్ద మరోమారు గంధం సమర్పణ చేసి ప్రార్థనలు చేశారు.

మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన పీర్లను శుక్రవారం ఊరేగింపుగా తీసుకెళ్లి నీళ్లతో శుభ్రపరిచి పెట్టెల్లో భద్రపరిచారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement