మదనపల్లె టౌన్: డెంగ్యూ నివారణ.. మనందరి బాధ్యత అని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. జాతీయ కీటకజనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శనివారం మదనపల్లెలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసు నుంచి పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి రామచంద్రా రెడ్డి మాట్లాడారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్ఓ


