
బూత్ కమిటీ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల వాగ్వాదం
నందలూరు : నందలూరు షాదీఖానాలో గురువారం నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి వాగ్వాదం చేసుకున్నారు. కుటుంబ సాధికారత సమితి (కేఎస్ఎస్) కమిటీలు వేసేటప్పుడు తమకు ఎందుకు చెప్పలేదని కొంత మంది టీడీపీ నాయకులు ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నాయకులందరికీ చెప్పాల్సిన అవసరం లేదని కొంత మంది నాయకులు తెలపడంతో వాగ్వాదం మొదలైంది. నందలూరు మండల పరిశీలకుడు ఆరే సుధాకర్నాయుడు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. రాజంపేట టీడీపీ ఇన్చార్జిని ప్రకటించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు.