
భారీ స్కోరు దిశగా కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు భారీ స్కోరు దిశగా ఆడుతోంది. తొలి రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో కడప, కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 93 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 291 బంతుల్లో 23 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. గురు విఘ్నేష్ 147 బంతుల్లో 15 ఫోర్లు, 6 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో..
అదే విధంగా కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 50.4 ఓవర్లకు 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మన్విత్రెడ్డి 48, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 32 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు, వరుణ్ సాయి నాయుడు 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి, 107 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేయగా జయంత్ కృష్ణ 78 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
డబుల్ సెంచరీ చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్ రెడ్డి

భారీ స్కోరు దిశగా కడప జట్టు

భారీ స్కోరు దిశగా కడప జట్టు

భారీ స్కోరు దిశగా కడప జట్టు

భారీ స్కోరు దిశగా కడప జట్టు