
● వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రైతుకు భరోసా
సాక్షి రాయచోటి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయినా రైతులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు.అరక చేతపట్టి పొలంబాట పట్టిన రైతులు దిగాలుగా సాగుకు సిద్ధమయ్యారు. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేసి వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. ప్రస్తుత కూటమి సర్కార్ తల్లికి వందనం పథకం అమలు చేసే విషయంలో అనేక నిబంధనలు విధించింది. ఈ కారణంగా చాలామందికి పథకం వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకంపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు రైతులు ఉన్నా ఒక్కరికే అందిస్తారన్న ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అనేక రకాల నిబంధనలు వర్తిస్తాయని గతంలో ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు. దీంతో చాలామంది రైతులను ఆర్థికసాయం అందుతుందో లేదోనన్న ఆందోళన వెంటాడుతోంది. కూటమి సర్కార్ మూడు విడతల్లో పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం సొమ్ములను అందించే దిశగా కసరత్తు చేస్తున్నారు.
వ్యవసాయాన్నే నమ్ముకుని ఆరుగాలం చెమటోడ్చి కష్టపడుతున్న అన్నదాతకు ఆందోళన తప్పడం లేదు. కనీసం ప్రభుత్వాలైనా కష్టకాలంలో స్వాంతన చేకూర్చాలి. రైతును ఆదుకోవడంతోపాటు భరోసా కల్పిస్తే వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాడు. గతంలో వైఎస్సార్ సీపీ సర్కార్ హయాంలో ఖరీఫ్ సీజన్కు ముందే...ప్రతి ఏడాది మే నెలలో పెట్టుబడి భరోసా నిధులు విడుదల చేస్తూ అన్నదాతకు అండగా నిలిచిన పరిస్థితులు ఉండేవి.అప్పట్లో భూమితోపాటు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా సొమ్ములు అందాయి. ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలో అందుకు విరుద్ధమైన పరిిస్థితులు తలెత్తడం ఆందోళన కలిగించే పరిణామం.
అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూస్తున్నాం!
అన్నదాత సుఖీభవ కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తూనే ఉన్నాం. రెండో సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా ఇంతవరకు అన్నదాత సుఖీభవ డబ్బులు వేయలేదు. మార్కెట్లో ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకోవాలంటే వ్యాపారుల దగ్గర అప్పులు చేసుకుని సేద్యం సాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద నగదు జమ చేసి ఆదుకోవాలి.
– చెన్నకేశవరెడ్డిబాబు, రైతు,
చింతకుంటవాండ్లపల్లె, లక్కిరెడ్డిపల్లి
మండలం, అన్నమయ్య జిల్లా
భరోసా లేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇప్పటికి ఒక్క విడత కూడా అన్నదాత సుఖీభవ సొమ్ము ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విత్తనం నుంచి ఎరువుల వరకు రైతు భరోసా కేంద్రాల అందించేవారు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వంనుంచి భరోసా లేకపోవడంతో రైతులు వ్యవసాయం చేయాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికై నా అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు అందించాలి. అన్నదాతకు భరోసా కల్పించాలి.
– ఆవుల చంద్రారెడ్డి,
మల్లూరు గ్రామం, చిన్నమండెం మండలం
ఖరీఫ్ పనులు ప్రారంభం
అన్నదాతలను పట్టించుకోని ప్రభుత్వం
వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం
జిల్లాలో 2.30 లక్షల మంది రైతులు
అన్నదాత సుఖీభవ సాయం కోసం ఎదురుచూపులు
2019లో అధికారంలోకి వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి ఏడాది మే నెలలోనే నిధులు విడుదల చేసేవారు. ఎందుకంటే ఖరీఫ్లో పంట సాగు మొదలు పెట్టే రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఆశయంతో వైఎస్ జగన్ సర్కార్ పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల చేసే పరిస్థితి ఉండేది. జిల్లాలో సుమారు 2.20 లక్షల మంది అన్నదాతలు ఉండగా, దాదాపు అందరికీ అందించే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ నిబంధనల సాకుతో కుటుంబంలో ఒక్కరికే అందిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆందోళన నెలకొంది. ప్రతి ఏడాది ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా అనుకున్న సమయంలోనే వైఎస్జగన్ సర్కార్ రైతులకు ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఆర్థికసాయం అందించి భరోసాగా నిలిచింది.

● వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రైతుకు భరోసా

● వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రైతుకు భరోసా

● వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రైతుకు భరోసా

● వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రైతుకు భరోసా

● వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రైతుకు భరోసా