విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా? | - | Sakshi
Sakshi News home page

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా?

Jun 20 2025 6:07 AM | Updated on Jun 20 2025 6:07 AM

విద్య

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా?

మదనపల్లె సిటీ: జిల్లాలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, కాలేజీల్లో విద్యావ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒకవైపు అధిక ఫీజులతో సతమతమవుతున్న మధ్య తరగతి వర్గాల వారు ఈ ఏడాది భారీగా పెంచిన పుస్తకాల ధరలతో షాక్‌ అవుతున్నారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థల యజమాన్యాలు సొంత సిలబస్‌ పేరుతో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాయి.ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు రూ. వందల్లో ఉంటే,ప్రైవేట్‌ విద్యా సంస్థలు ముద్రించిన వాటి ధరలు రూ.వేలల్లో ఉంటున్నాయి. జిల్లాలోని మదన పల్లె, రాయచోటి, పీలేరు, రాజంపేట, రైల్వేకో డూరు, వాల్మీకిపురంతోపాటు మండల కేంద్రా లు, మేజర్‌ పంచాయతీల్లో నిర్వహిస్తున్న పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, ఇతర సామగ్రి అమ్ముతున్న నిర్వాహకులు 1నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.7,500 నుంచి రూ. 10,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఇంటర్మీ డియట్‌కై తే ఈ దోపిడీ మరింత ఎక్కువగా ఉంటోంది. నీట్‌, ఐఐటీ,ఒలింపియాడ్‌, సీబ్యాచ్‌, ఎం.బ్యాచ్‌, టెక్నో వంటి పేర్లతో అదనంగా వసూలు చేస్తున్నారు. బడి బస్సుల ధరలనూ అడ్డగోలుగా పెంచేస్తున్నారని, గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి

జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల నిర్వాహకులు పలు రకాల ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

–మాధవ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి

గుర్తింపు రద్దు చేయాలి:

నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్న విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి. ఇలా జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదో వారికే తెలియాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పుస్తకాలు, అధిక ఫీజుల వసూళ్ౖలపై చర్యలు తీసుకోవాలి. –నరసింహ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

సూపర్‌ మార్కెట్‌ తరహాలో..

జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ కార్పొరేట్‌ విద్యా సంస్థల బ్రాంచీలన్నీ సూపర్‌మార్కెట్‌లను తలపిస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రితో స్టోర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంబంధించి అన్నివస్తువులూ తమ వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేయడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు వారికి వేలాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులను తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో అంతులేని దోపిడీ

అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం, సామగ్రి విక్రయాలు

తడిసి మోపెడవుతున్న ఖర్చులు

చూసీచూడనట్లు వ్యహరిస్తున్న అధికారులు

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా? 1
1/4

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా?

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా? 2
2/4

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా?

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా? 3
3/4

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా?

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా? 4
4/4

విద్యాలయాలా..వ్యాపార కేంద్రాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement