
లాసెట్లో మెరిసిన మనోళ్లు
ఒంటిమిట్ట/పీలేరు రూరల్/రాయచోటి జగదాంబ సెంటర్: ఏపీ లాసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మనోళ్లు మెరిశారు. వేర్వేరు విభాగాల్లో 1,2,4 ర్యాంకులు సాధించి భళా అనిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5న నిర్వహించిన ఏపీ లాసెట్, ఏపీ పీజీ సెట్–2025 ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
● పీలేరు విద్యార్థిని పల్లపు గిరీష్మ ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సులో ప్రథమ ర్యాంక్ సాధించింది. పీలేరులో న్యాయవాదిగా పని చేస్తున్న మండలంలోని ముడుపులవేముల పంచాయతీ రాయలవారిపల్లెకు చెందిన జయశంకర్ కుమార్తె గిరీష్మ.. స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల సీఈసీ గ్రూపులో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ఆమె లాసెట్లో 107 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు కై వసం చేసుకుంది.
● ఒంటిమిట్టకు చెందిన వై.లోకేశ్వరి ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్షలో 120 మార్కులకు 108 సాధించి రెండో ర్యాంకు సాధించింది. హైదరాబాద్లోని మియాపూర్లో శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో ఇంటర్లో చేరి హెచ్ఈసీ గ్రూపు తీసుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇటీవల వైజాగ్లోని సెంట్రల్ నల్సార్ దామోద రయ్య, సంజీవయ్య వర్సిటీలో మాస్టర్ ఆఫ్ లా సీటు సాధించారు. ప్రస్తుతం యూపీఎస్సీ ఢిల్లీ అ కాడమీ ఆన్లైన్ క్లాసుల ద్వారా సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు.
● రాయచోటికి చెందిన వి.రమేష్ ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సులో 113 మార్కులతో స్టేట్ 4వ ర్యాంకు సాధించారు.

లాసెట్లో మెరిసిన మనోళ్లు