
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.
ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలు తదితరాలపై వారితో వైఎస్ జగన్ చర్చించనున్నారు.