రాజ్యసభలో వైఎస్సార్సీపీకి పెరిగిన ప్రాధాన్యత | YSRCP Is The Fourth Largest Party Iin The Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో వైఎస్సార్సీపీకి పెరిగిన ప్రాధాన్యత

Aug 3 2020 6:01 PM | Updated on Aug 3 2020 6:39 PM

YSRCP Is The Fourth Largest Party Iin The Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ : రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రాధాన్యత పెరుగుతోంది. తాజాగా రాజ్యసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం పెరగడంతో బీఏసీలో చోటు లభించింది. అలాగే  రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవతరించింది. (‘సీఎం జగన్ పాలన మహిళలకు స్వర్ణ యుగం’)

రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు

1. విజయసాయిరెడ్డి
2. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
3.పిల్లి సుభాష్ చంద్రబోస్
4. మోపిదేవి వెంకటరమణ
5. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
6. పరిమళ్ నత్వాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement