మిలమిల.. జగనన్న కాలనీ ఇలా.. 

YSR Jagananna Colonies Gradually Turn New Shape - Sakshi

పేదలందరికీ పక్కా ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు వద్ద 88 ఎకరాల విస్తీర్ణంలోని జగనన్న కాలనీలో పనులు వేగంగా జరుగుతున్నాయి.

సుమారు 3 వేల గృహాల నిర్మాణాలు వివిధ దశలలో ఉండగా.. ప్రభుత్వం రూ.3 కోట్లతో విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టి.. వీధి లైట్లు ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంతమంతా జిగేల్‌మంటూ మెరిసిపోతోంది.     
– మార్కాపురం (ప్రకాశం జిల్లా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top