రేపు కల్లి తండాకు వైఎస్‌ జగన్‌ | YS Jagan To Visit Martyred Soldier Murali Naik Family In Sathya Sai District Kallithanda On May 13th, Details Inside | Sakshi
Sakshi News home page

రేపు కల్లి తండాకు వైఎస్‌ జగన్‌

May 12 2025 4:43 AM | Updated on May 12 2025 12:53 PM

YS Jagan to visit Kali thanda on May 13: Andhra pradesh

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాలో పర్యటించనున్నారు.

ఉదయం 11.30 గంటలకు కల్లి తండాలోని వీర జవాన్‌ మురళీ నాయక్‌ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతారు. వీర జవాన్‌ మురళీ నాయక్‌ మృతిపట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌... కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement