సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే లింగనపల్లి హెలీప్యాడ్ వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. కాగా, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు.
రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి, తేజేష్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు వైఎస్ జగన్.






