సాక్షి, తాడేపల్లి: నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సర్ ఆర్థర్ కాటన్కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని కొనియాడారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేం అని’ పోస్టు చేశారు.
గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు ఆయన. వ్యవసాయ, నీటిపారుదల… pic.twitter.com/0qGZb5fLKH
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2026


