పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య

Young Man Last Breath By Jumping Into Krishna River At Paritala - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ యువకుడు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు పట్టుబడ్డాడు. విషయం అందరికీ తెలిసిపోవటంతో మనస్తాపం చెందిన రాజశేఖర్‌రెడ్డి నిన్న రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడని పోలీసులు కొట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తల్లి ఆరోపించారు. మరోవైపు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామే తప్ప కొట్టలేదంటున్న పోలీసులు చెప్తున్నారు.
(చదవండి: చూస్తుండగానే కృష్ణానదిలో దూకిన డాక్టర్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top