సాక్షి, కడప: వైయస్సార్ జిల్లాలో ఘోర విషాదం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నూరు మండలం ముళ్లపల్లెకి చెందిన సుధీర్, పెంచలమ్మ దంపతులు శనివారం రైలు కింద పడి బలవన్మరణం చెందారు.
శనివారం మధ్యాహ్నం కనుమలోపల్లె రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి భర్త సుధీర్ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని భార్య సాయంత్రం అదే ప్రాంతంలో మరో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మృతికి కారణాలపై విచారిస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు.


