తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 30 చివరి తేదీ కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3. ఏప్రిల్ 17న ఎన్నిక నిర్వహించి, మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.