బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట: మోపిదేవి

Mopidevi Speaks About CM YS Jagan Two Years Ruling - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్​మోహన్​రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు సీఎం జగన్​ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని  కొనియాడారు. అదే విధంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని మోపిదేవి పేర్కొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. అన్ని రకాల సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి సుపరిపాలనను అందిస్తున్నారని  మోపిదేవి అన్నారు. 

చదవండి: అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం: మంత్రి బొత్స

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top