Live Updates
తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ జయంతి
హైదరాబాద్: గాంధీభవన్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
- హైదరాబాద్: గాంధీభవన్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
- మంత్రులు శ్రీధర్బాబు, వివేక్, సీనియర్ నేత కేవీపీ హాజరు
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఖర్గే, రాహుల్ ట్వీట్
- వైఎస్సార్ విజనరీ లీడర్: మల్లికార్జున ఖర్గే
- ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు
- ముఖ్యంగా రైతులు, పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేశారు
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన రాజనీతిజ్ఞుడు: రాహుల్
- ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు
పెద్దిరెడ్డి నివాసంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
- సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు: పెద్దిరెడ్డి
- మావిగన్తో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి
- అమరావతి పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృథా
- రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం
- రాష్ట్రంలో తప్పుడు జరిగితే మౌనంగా ఉండాలా?
గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో..
గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఒంటిచేత్తో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన నాయకుడు మహానేత వైఎస్సార్: అంబటి
తెలుగు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు
మహానేత వైఎస్సార్ మృతి.. తెలుగు ప్రజలకు తీరని లోటు
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
- వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు
- కేక్ కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
- హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలగంల్లి శ్రీనివాస్, శైలజానాథ్, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు
విజయవాడలో..
విజయవాడలో మహానేత వైఎస్సార్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పశ్చిమలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాలయం సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు.
వాడవాడలా వైఎస్సార్ జయంతి
జనహృదయ నేతను.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆరోగ్యప్రదాతను ప్రజలు స్మరించుకున్నారు. సంక్షేమ సారథికి సలాం చేశారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడిక క్కడ కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలతో ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.


