బదిలీల పేరుతో బంతాట! | Hundreds of employees circling superiors for postings | Sakshi
Sakshi News home page

బదిలీల పేరుతో బంతాట!

Jul 17 2025 5:59 AM | Updated on Jul 17 2025 5:59 AM

Hundreds of employees circling superiors for postings

బదిలీ చేసిన చోట చేరడానికి సచివాలయాల ఉద్యోగులకు రాజకీయ ఇబ్బందులు

ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వద్దన్నారంటూ చాలాచోట్ల విధుల్లో చేర్చుకోని దుస్థితి 

దివ్యాంగులకు సైతం తప్పని తిప్పలు

పోస్టింగ్‌ కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది ఉద్యోగులు

సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో పని చేస్తున్న దివ్యాంగ కేటగిరీకి చెందిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక గ్రామ సచివాలయానికి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అక్కడ విధుల్లో చేరేందుకు ఆయన రెండు రోజుల కిందట వెళ్లారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో వేచి ఉన్నా, ఆయన నుంచి జాయినింగ్‌ రిపోర్టు తీసుకోలేదు. కారణం అడిగితే ఎమ్మెల్యే కార్యాల­యం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సచివాలయ సిబ్బంది బదులిచ్చారు. 

ఈ విషయాన్ని సదరు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తే... మరోచోటకు బదిలీ చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సచివాలయాల ఉద్యోగులు ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలు లేకపోతే ఉద్యోగులు విధుల్లో కూడా చేరలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

వారం కిందటే బదిలీల ప్రక్రియ ముగిసినా...
సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారికంగా వారం రోజుల కిందటే ముగిసింది. సినియారిటీతో సంబంధం లేకుండా అధికార పార్టీ నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వేలాది మంది ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేశారు. అయితే, బుధవారం నాటికి కూడా చాలాచోట్ల బదిలీ అయిన స్థానాల్లో ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడం లేదు. 

తమను ఎందుకు విధుల్లో చేర్చుకోవడం లేదని సచి­వాల­యాల ఉద్యోగులు ప్రశ్నిస్తే... ‘మిమ్మల్ని చేర్చుకో­వద్దని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది’ అంటూ అక్కడ పనిచేసే తోటి పర్యవేక్షణ సిబ్బంది బదులిస్తున్నారు. దీంతో వివిధ కేటగిరీ­లకు చెందిన వందలమంది ఉ­ద్యోగులు తమ బదిలీల ఉత్తర్వుల కాపీలను ప­ట్టుకొని పోస్టింగ్‌ల కోసం జిల్లా శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందు­లో దివ్యాంగులు కూడా ఉన్నారు. అధికార పార్టీ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం సచివా­లయ ఉద్యోగులతో చెలగాటం ఆడు­తున్నారని ఉ­ద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement