‘క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఫలితాలు కీలకం’

Forensic Results Key Role In Criminal Cases Tanita Vanita - Sakshi

అనంతపురం: అనంతపురంలో రీజనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది. ల్యాబ్‌ను హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెంమంత్రి మాట్లాడుతూ, క్రిమినల్‌ కేసులు ఛేదించటంలో ఫోరెన్సిక్‌ ఫలితాలే కీలకమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో స్పందించేలా వ్యవస్థలో మార్పు తెచ్చామని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలవుతుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కృషి వల్లే దిశా చట్టం తెచ్చామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top