సీఎం జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు

Employees Union JAC Leaders Meet to YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. అసోసియేషన్ల క్యాలెండర్, డైరీలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియతో మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం చెప్పారని ఆయన తెలిపారు.

‘‘రెండు డీఏలు కూడా ఇవ్వాలని కోరాం. సంక్రాంతికి ఒక డీఏ, ఏప్రిల్‌ నుంచి ఎరియర్స్‌ ఇస్తామన్నారు. సీఎంకు ఉద్యోగుల తరఫున కృతజ్ఞలు తెలుపుతున్నాం’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు.


చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top