సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్య పెద్ద వ్యాపారంగా మారిపోయిందని సోమవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్ష ‘డీసెట్’తో సంబంధం లేకుండా ‘స్పాట్ అడ్మిషన్’ పేరుతో డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడం ఏ మాత్రం సబబు కాదని తేల్చిచెప్పింది.
► స్పాట్ అడ్మిషన్ అంటేనే దొడ్డిదారిన ప్రవేశం కల్పించడమని, ఇందుకు ఏ చట్ట నిబంధనలు కూడా అంగీకరించవని స్పష్టం చేసింది.
► డీసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని, అసలు పరీక్షే రాయని వారికి ‘స్పాట్ అడ్మిషన్’ పేరుతో ఎలా ప్రవేశాలు ఇస్తారని డీఈడీ కాలేజీ యాజమాన్యాలను నిలదీసింది.
► 2018–19, 2019–20లకు ప్రభుత్వం అనుమతినివ్వనప్పుడు విద్యార్థులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించింది.
► 2017–18 విద్యా సంవత్సరానికి అనుమతినిచ్చి నాటి ప్రభుత్వం తప్పు చేస్తే, మళ్లీ మళ్లీ ప్రభుత్వాన్ని అదే తప్పు చేయమంటారా అని నిలదీసింది. ఆ తప్పు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించమంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు తాము ఎప్పుడూ ఇవ్వలేమంది.
► స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై కూడా సానుభూతి చూపలేమని తేల్చిచెప్పింది. అవసరమైతే వారి నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
► సింగిల్ జడ్జి వద్ద డీఈడీ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
► 2018–19, 2019–20 సంవత్సరాలకు తమ కాలేజీల్లో ప్రవేశాలను ప్రభుత్వం ఆమోదించకపోవడాన్ని సవాల్ చేస్తూ డీఈడీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలను సింగిల్ జడ్జి జస్టిస్ రజనీ తోసిపుచ్చారు. దీనిపై డీఈడీ కాలేజీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
► ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ విద్యార్థుల నుంచి ఈ డీఈడీ కాలేజీలు లక్షల రూపాయలు దోచేశాయన్నారు.
దేశంలో విద్య వ్యాపారమైపోయింది
Published Tue, Sep 29 2020 4:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement