‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’ | Covid: Ayush Team Report Krishnapatnam Medicine Not Ayurvedic | Sakshi
Sakshi News home page

‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’

May 22 2021 9:42 PM | Updated on May 22 2021 9:52 PM

Covid: Ayush Team Report Krishnapatnam Medicine Not Ayurvedic - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆనందయ్య చేస్తున్న కరోనా మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ లేవని అధ్యయనం చేస్తున్న ఆయుష్‌ కమిషనర్‌ రాములు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా కాకుండా నాటు మందుగా పరిగణిస్తామని రాములు తెలిపారు. మందు తయారీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం. మందు తయారీలో ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవని పేర్కొన్నారు. అలాగే ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కాదని కూడా తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్ధాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. కాకపోతే ఈ మందును అనేక ఆరోగ్య సమస్యల కోసం తయారు చేశానని ఆనందయ్య చెప్పారు. కరోనా కోసం తయారు చేశానని చెప్పలేదని'  వెల్లడించారు. త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాములు తెలిపారు.

చదవండి: వ్యాక్సినేషన్‌పై ప్రధానికి మరోసారి సీఎం జగన్‌ లేఖ

Advertisement
 
Advertisement
Advertisement