‘కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌’లకు రెడ్‌బుక్‌ కుట్ర బాధ్యతలు! | Chandrababu Govt IPS Postings IN AP | Sakshi
Sakshi News home page

‘కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌’లకు రెడ్‌బుక్‌ కుట్ర బాధ్యతలు!

Aug 14 2025 7:40 AM | Updated on Aug 14 2025 7:40 AM

Chandrababu Govt IPS Postings IN AP

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కుట్రలకు అడ్డగోలుగా వ­త్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అ­వకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కా­రు స­న్నద్దమవుతోంది. అందుకోసం క్యాడ­ర్‌ ఐపీఎ­స్‌ అ­ధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్‌­ఫ­ర్డ్‌ ఐపీఎస్‌’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.  

రెడ్‌బుక్‌ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు.. 
టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్‌ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్‌ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్‌ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్‌ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.

సీఐడీ ఐజీగా ఉన్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ రెడ్‌బుక్‌ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్‌ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్‌ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు.  

అస్మదీయ కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్‌ కుట్ర.. 
చంద్రబాబు ప్రభు­త్వం మ­రో ఎత్తుగడకు తెర­తీసింది. తమ­కు అస్మదీయులైన కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్‌ కుట్రను తీవ్రతరం చేయా­లని భావిస్తోం­ది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.

కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అ«­దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందు­కు వీలుగా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement