సాక్షి, అమరావతి : ఉక్రెయిన్లో విద్య కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్న ఏపీ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిలో ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) చేస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చే విషయమై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం అక్కడ విమాన ప్రయాణాలపై నిషేధం (నో ఫ్ల్లయింగ్ ఆంక్షలు) ఉండటంతో విమాన సర్వీసులు నడవడంలేదని, అవి మొదలుకాగానే విద్యార్థులందరినీ వెనక్కి తీసుకురానున్నట్లు ఏపీఎన్ఆర్టీఎస్ సీఈఓ దినేష్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
రెండ్రోజుల క్రితం 30 మందిని స్వస్థలాలకు క్షేమంగా తీసుకువచ్చామన్నారు. అలాగే, ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో సుమారు 200 మంది విద్యార్థులున్నారని, వీరితో ఎప్పటికప్పుడు ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులు మాట్లాడుతూ వారికి మనోధైర్యాన్ని కలిగించడంతోపాటు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి విద్యార్థులు అంతా ధైర్యంగానే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎవరూ బయట సంచరించవద్దని చెప్పామన్నారు. ఉక్రెయిన్లో ఉన్న వారి వివరాలను ఏపీఎన్ఆర్టీ సేకరించడంతోపాటు స్థానిక ఎంబసీలో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా వారికి సూచించినట్లు దినేష్కుమార్ తెలిపారు.
ప్రత్యేక అధికారుల నియామకం
ఇక ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యతను ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర అంతర్జాతీయ సహకార ప్రత్యేక అధికారి, రిటైరైన విదేశీ వ్యవçహారాల అధికారి గీతేష్ శర్మతో పాటు నోడల్ అధికారి రవిశంకర్లకు ఈ బాధ్యతలను అప్పగించింది. గీతేష్ శర్మను 7531904820 నంబర్లో, రవిశంకర్ను 9871999055 నెంబర్లలో సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇతర అత్యవసర సాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులను 0863–2340678 నంబర్, లేదా 91–8500027678 నంబర్ను వాట్సప్ ద్వారా సంప్రదించాలని కోరింది. అంతేకాక.. ఉక్రెయిన్లో భారతీయుల కోసం ప్రత్యేంగా +380–997300428, +380–997300483 హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
మరోవైపు.. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని, వీటిని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలను క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావడానికి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రణాళికలను సిద్ధంచేసిందని దినేష్కుమార్ వెల్లడించారు.
విద్యార్థుల తరలింపునకు ఏపీఎన్ఆర్టీఎస్ చర్యలు
Published Fri, Feb 25 2022 4:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement