చికిత్స పొందుతున్న మరో 30 మంది
శ్రీకాకుళం: శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సింగుపురం గ్రామంలో డయేరియా విజృంభించింది. డయేరియా బారిన పడి వారం కిందట కొన్ని గోపి(55)అనే వ్యక్తి మృతి చెందగా, బుధవారం బెలమాన బైరాగి (50) అనే వ్యక్తి వాంతులు, విరేచనాలతో మృతిచెందడం గ్రామస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
మరో 30 మంది వరకు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత వ్యవహారం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గ్రామంలో కనీసం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయకపోవడంపై సింగుపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


