ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు | Andhra Pradesh Rajya Sabha name Confirmed | Sakshi
Sakshi News home page

ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు

Apr 28 2025 7:25 PM | Updated on Apr 28 2025 9:22 PM

Andhra Pradesh Rajya Sabha name Confirmed

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.  కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్‌ వేయబోతునున్నారు. 

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్‌గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement