breaking news
Venkata Satyanarayana
-
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ వేయబోతునున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన. -
అందుకే ఆపరేషన్ రావణ్ టైటిల్ పెట్టాం: వెంకట సత్య
‘‘రామాయణం’లోని కొన్ని రిఫరెన్్సలను తీసుకుని మా సినిమా కథను రెడీ చేసుకున్నాం. అందుకే మా చిత్రానికి ‘ఆపరేషన్ రావణ్’ అనే టైటిల్ పెట్టాం. అయితే ‘రామాయణం’లో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు. మా మూవీలో మాస్క్ పెట్టుకుని వస్తాడు’’ అని డైరెక్టర్ వెంకట సత్య అన్నారు. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జోడీగా రాధికా శరత్కుమార్, చరణ్రాజ్ కీలక పాత్రల్లో నటించిన న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ– ‘‘కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, రాజమౌళి, స్టీవెన్ స్పిల్బర్గ్గార్లు నా ఫేవరేట్ డైరెక్టర్స్. రాజమౌళిగారిలాంటి దర్శకుడు ధైర్యంగా ముందడుగు వేసి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లాంటి సినిమాలు చేయకపోతే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ఆస్కార్ అందుకునేది కాదు.ఇక ‘ఆపరేషన్ రావణ్’ విషయానికొస్తే.. ఓ మనిషి సైకోగా ఎందుకు మారతాడు? అనే అంశాన్ని చూపిస్తున్నాం. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్తో షూటింగ్ పూర్తి చేశాం. అయితే సినిమా తీసినంత సులభంగా రిలీజ్ చేసుకోలేమని తెలుసుకున్నాను. నా కొడుకు రక్షిత్ అట్లూరి పాత్ర, నటన బాగుంటాయి. ‘పలాస 2’ సినిమా ఆలోచనలో ఉన్నాం. మా బ్యానర్ నుంచి ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
YSRCP నేతపై కత్తితో దాడి
-
చైతన్య సిరి..క్షీరపురి
సాక్షి, పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. బ్రిటిష్ కాలంలోనే వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందింది. పారిశ్రామికంగానూ ప్రగతి సాధించింది. రైస్మిల్లులకు ప్రసిద్ధి. కొబ్బరి, నిమ్మ, తమలపాకు ఉత్పత్తులు నిత్యం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. భౌగోళిక స్వరూపం పాలకొల్లు నియోజకవర్గం 180చదరపుకిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పున వశిష్టగోదావరి, పడమరన భీమవరం, ఉత్తరాన ఆచంట, దక్షిణాన నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొల్లు మున్సిపాలిటీలో 31వార్డులు, యలమంచిలి మండలంలో 32 గ్రామాలు, పాలకొల్లు మండలంలో 27 గ్రామాలు, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 67 గ్రామాలతో నియోజకవర్గం విస్తరించింది. దిగ్గజ కళాకారుల జన్మస్థానం ఈ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఆ నాటి అత్యం సూర్యం, పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి పద్మశ్రీ అల్లు రామలింగయ్య, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎస్ఎస్ రవిచంద్ర, బందెల భాస్కరరావుతోపాటు అనేక మందిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత పాలకొల్లుకు దక్కింది. సినీ రంగంలోని అన్ని విభాగాల్లోనూ పాలకొల్లు మార్కు ఉంటుంది. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వరస్వామి ఇక్కడ కొలువు కావడంతో ఆ నటరాజస్వామి ఆశీస్సులతో ఇంతమంది కళాకారులు ఉద్భవించారని ప్రతీతి. చారిత్రక ప్రాముఖ్యం పాలకొల్లు పట్టణం 11 శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఉండేది. ఈ సమయంలోనే క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం, గాలిగోపురం నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. పంచారామక్షేత్రాల్లో క్షీరారామం శిరోభాగంగా విరాజిల్లుతోంది. అలాగే శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం, నరసాపురం రోడ్డులోని శ్రీ షిర్డి సాయి మందిరంతోపాటు, వాయుత్రిలింగ క్షేత్రాలుగా శివదేవునిచిక్కాల, దిగమర్రులోని శివాలయాలు ప్రసిద్ధిచెందాయి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. వ్యవసాయమే జీవనాధారం నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణవాతావరణం. ప్రజల జీవనాధారం వ్యవసాయం. ముఖ్యంగా వరి, కొబ్బరి, నిమ్మ, తమలపాకు, అరటి పంటలు సాగవుతాయి. 15ఏళ్లుగా ఆక్వా సాగు విస్తరించింది. వరిచేలు చెరువులుగా మారాయి. ఈ ప్రాంతం నుంచి రోజూ వంద లారీల రొయ్యలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రాజకీయ నేపథ్యం పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. 2004వరకు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల మధ్యే ప్రధాన పోరు జరిగింది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గెలుపొందారు. 1955లో అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, దాసరి పెరుమాళ్లు (ఎస్సీ రిజర్వుడు) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1962లో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 1967లో పోలిశెట్టి శేషావతారం సీపీఎం అభ్యర్థిగా గెలిచారు. 1972లో చేగొండి వెంకట హరరామజోగయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి వర్థినీడి సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావంతో అల్లు వెంకట సత్యనారాయణ 1983,1985,1994,1999 లోనూ విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి వెంకట హరరామజోగయ్య గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి గెలిచారు. 2009లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిపై అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2014ఎన్నికల్లో రామానాయుడు గెలిచారు. నియోజకవర్గంలో మండలాలు : పాలకొల్లు, యలమంచిలి, పోడూరు జనాభా : 2,49,569 పురుషులు : 1,25,973 స్త్రీలు : 1,23,447 ఓటర్లు : 1,80,965 పురుషులు : 89,491 స్త్రీలు : 91,435 ఇతరులు : 39 ముఖ్య సమస్యలివీ.. పాలకొల్లు పట్టణ నడిబొడ్డున డంపింగ్యార్డుల వల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. పట్టణంలో దమ్మయ్యపత్తి డ్రెయిన్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా సుమారు రూ.8కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య డ్రెయినేజీ సమస్యలు సతమతం చేస్తున్నాయి. -
ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మున్సిపల్ డీఈ వంగపండు వెంకట సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేశారు. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేసి... సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1.10 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే పలు కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కృష్ణాజిల్లా గుడివాడలోని మరో ప్రదేశాలలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ ఆటకట్టించారు. అతని నుంచి రూ.39 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ... యానాంలోని దరియాల తిప్ప ప్రాంతానికి చెందిన చప్పిడి వీర వెంకట సత్యనారాయణ(35) కొంతకాలంగా పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై ఇటీవల గొల్లపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందం గాలించి మంగళవారం నిందితుడిని పట్టుకుంది. బుధవారం ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. అతడి నుంచి 1,147 గ్రాముల బంగారం, 11.63 కిలోల వెండితో పాటు రూ.3.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీర వెంకట సత్యనారాయణను రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.