ఏపీ: 94 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

1316 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 94,08,868 పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 75,165 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,316 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 1,821 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,35,801 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 16,000. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,910కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి : కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top