విడపనకల్లు: ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హెచ్చెల్సీ ద్వారా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఆయకట్టుకు నీరు వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో విడపనకల్లు మండలం ఎన్.తిమ్మాపురం గ్రామానికి చెందిన హంపేష్ అనే రైతు బోరు కింద వస్తున్న అరకొర నీటితోనే నెలన్నర కిందట ఐదు ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగు చేశాడు. అయితే ఇప్పుడు ఆ పంటకు విల్టు రోగం సోకింది. వైరస్తో మొక్క వాడిపోయి బూడిదరంగులోకి మారిపోవడం.. దిగుబడి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉండటంతో చేసేది లేక రైతు ఆదివారం ట్రాక్టర్తో పంటను దున్నేశాడు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.


