
జిల్లాలో మంగళవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వే
ఎస్కేయూలో సాఫ్ట్వేర్
టెస్టింగ్ కోర్సు ప్రారంభం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయుక్తంగా ‘సర్టిఫికెట్ కోర్సు ఇన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ టెస్టింగ్’ను ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ఉద్యోగార్హత, పరిశ్రమల అనుసంధానం పెంచే లక్ష్యంతో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. కళాశాల–పరిశ్రమల మధ్య ఉండే అంతరం తగ్గేలా నైపుణ్య ఆధారిత కోర్సును అందించేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ‘ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ వెంచర్ డెవలప్మెంట్’ కోర్సు ద్వారా 400 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందిన విషయం తెలిసిందే. తాజాగా రెండో కోర్సు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ టెస్టింగ్ కోర్సును మంగళవారం ఎస్కేయూ ఇన్చార్జి వీసీ ఆచార్య బి.అనిత చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, అటల్ ఇంక్యుబేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నాగభూషణరాజు, ప్రిన్సిపాల్ ఎ.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
రైళ్లల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
అనంతపురం సిటీ: స్థానిక రైల్వే స్టేషన్లో రైళ్లను ప్రత్యేక పోలీస్ బృందం సహా మూడో పట్టణ పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ ఈ తనిఖీలు కొనసాగాయి. గంజాయి దిగుమతిని అడ్డుకునే క్రమంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లన్నీ తనిఖీ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు అనంతపురం మీదుగా వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన అన్నీ బోగీలను జల్లెడ పట్టారు. అనుమానాస్పద ప్రయాణికులు, వారి లగేజీని జాగిలంతో తనిఖీ చేయించారు.