7 బస్సులపై కేసుల నమోదు
గోపాలపట్నం(విశాఖ): పండగ సీజన్ను పురస్కరించుకుని రవాణా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఏడు ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎన్ఏడీ జంక్షన్ సమీపంలోని ఎన్ఎస్టీఎల్ వద్ద నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల ద్వారా మొత్తం రూ.33,600 జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ బుచ్చిరాజు, ఏఎంవీఐ పార్వతి, ఇతర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


