
● నిలిచిన డ్రెడ్జింగ్
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంగళవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు సాధారణ స్థాయికి మించి ఎగసిపడ్డాయి. ఈ ప్రభావం సబ్మైరెన్ మ్యూజియం వెనుక భాగంలో జరుగుతున్న డ్రెజ్జింగ్ పనులపై పడింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటాల ధాటికి డ్రెడ్జర్ నుంచి తీరానికి ఇసుకను తరలించడానికి ఉపయోగించే భారీ రబ్బరు ట్యూబ్ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో డ్రెజ్జింగ్ పనులు నిలిచిపోయాయి. ఈ రబ్బరు ట్యూబ్ను తిరిగి డ్రెజ్జర్కు అనుసంధానించి పనులను ప్రారంభించేందుకు డీసీఐ చర్యలు తీసుకుంటోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం