భోగిమంటలో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలు | - | Sakshi
Sakshi News home page

భోగిమంటలో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలు

Jan 14 2026 7:34 AM | Updated on Jan 14 2026 7:34 AM

భోగిమంటలో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలు

భోగిమంటలో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలు

సాక్షి,పాడేరు: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ జీవోలను భోగిమంటలో వేసి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. పాడేరులోని జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం రాత్రి భోగి మంట వేశారు. ఆ మంటలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవో పత్రాలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు,ఇతర నేతలు వేసి దహనం చేశారు.పేదలకు ఉచిత విద్య,వైద్యంను దూరం చేసే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారంతా డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర,అధికార ప్రతినిధులు కిల్లు కోటిబాబు,కూడా సురేష్‌కుమార్‌,కూడా సుబ్రహ్మణ్యం,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్‌,మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement