
ఏయూలో శతాబ్ది ఉత్సవాల జోష్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాల జోష్ కనిపిస్తోంది. ఈ నెల 26న వర్సిటీ వందో ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో భాగంగా వర్సిటీ పరిపాలన భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో క్యాంపస్లో శతాబ్ది ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. ఈ వేడుకల కోసం క్యాంపస్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. గురువారం సాయంత్రం కాలేజీ విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులందరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఇస్తూ.. నృత్యాలతో అలరించారు.

ఏయూలో శతాబ్ది ఉత్సవాల జోష్

ఏయూలో శతాబ్ది ఉత్సవాల జోష్