
మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం
జి.మాడుగుల/పాడేరు రూరల్: మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుని పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంగనయిని ఆనంద్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయుని పోస్టులో మెగా డిఎస్సీలో చేర్చటం దారుణమన్నారు. దీని వలన గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించవచ్చని ఆశతో ఇప్పటి వరకు ఉన్నారని కూటమి ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. అరుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు జీవో నంబర్ 3ని పునరుద్దరణ చేస్తానని, ప్రత్యేక డిఎస్సీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి తీరా అధికారం వచ్చాక మొండిచేయి చూపారని ఆయన మండిపడ్డారు. తక్షణమే గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుని పోస్టులు గిరిజన అభ్యర్థులుతో భర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముంచంగిపుట్టు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఉస్సిలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య అన్నారు.మండలంలో గల బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మిలో సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించడం దారుణమన్నారు.అల్లూరి జిల్లాలో ప్రకటించిన డీఎస్సిలో 400 పోస్టులలో ఎస్టీలకు కేవలం 24 పోస్టులే ఉండడం ఆదివాసీలకు నష్టం జరుగుతుందని,ఎంతో మంది గిరిజన నిరుద్యోగ యువతకు డిఎస్సిలో మోసం జరిగిందని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి స్పెషల్ డిఎస్సిను ప్రకటించాలని,లేని పక్షనా గిరిజన యువతతో ఆందోదన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నాయకులు దేవన్న,నాగరాజు తదితరులు పాల్గోన్నారు.

మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం