కెరమెరి/కుంటాల: శ్రావణ మాసం వచ్చిందంటే పల్లెలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. మహిళలకు ఈ వారం అత్యంత శ్రేష్టమైనది. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ముత్తైదువులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నిండు మనసుతో చేస్తే వారికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా ఉంటారని ప్రతీక. మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయం. ఈ రోజు ఇళ్లంతా శుభ్రపరిచి, ముగ్గులతో అలంకరించి కలశాన్ని ఏర్పర్చి పూజలు నిర్వహిస్తే సిరిసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే వరలక్ష్మీ వ్రతం గురించి వివిధ రకాల కథలు, పురాణాలు, ప్రాచూర్యంలో ఉన్నాయి. నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కథనం...


