చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే

చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

గుడిహత్నూర్‌: పిల్లలకు చదువుతోపాటు ఆటలూ ముఖ్యమేనని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసి న చిల్డ్రన్‌ పార్క్‌ను ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల శారీరక సామర్థ్యాలు పెంచుకోవడం కోసం ప్రతీ పోలీసుస్టేషన్‌లో చిల్డ్రన్‌పార్క్‌ ఏర్పాటు చేశామని, వాటిని చిన్నారులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్‌ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి ని ర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఇందులో ఇచ్చోడ సీఐ రాజు, పీఎస్సై మధుకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement