
దివ్యాంగ పిల్లల్లో రెండింతల మేధస్సు
ఆదిలాబాద్టౌన్: దివ్యాంగ పిల్లల్లో మేధ స్సు రెండింతలు ఉంటుందని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలికా విద్యా, విలీన విద్యా ది నోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని భవిత రిసోర్స్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. వైకల్యం గల పిల్లలను చిన్నచూపు చూడొద్దన్నారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. అనంతరం వారికి అక్షరభ్యాసం చేయించారు. కా ర్యక్రమంలో ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో సో మయ్య, డైట్కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, సెక్టోరియల్ అధికా రులు సుజాత్ఖాన్, తిరుపతి, శ్రీకాంత్,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయుడు లచ్చిరాం, ఎన్జీవో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.