
● మితిమీరుతున్న ‘ప్రైవేట్’ ఆగడాలు ● బడిలోనే నోట్బుక్
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుతం విద్య వ్యాపారంగా మా రింది. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవే ట్ యాజమాన్యాలు అవి చాలవన్నట్టుగా బడులను ఏకంగా సూపర్ మార్కెట్లను తలపించేలా చేస్తున్నా యి. అక్కడే నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, బెల్టు, టై, షూ, వంటివి అధిక ధరలకు విక్రయిస్తూ అంది నకాడికి దండుకుంటున్నారు. కొన్ని యాజమాన్యాలు వారు చెప్పిన చోటనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు హు కుం జారీ చేస్తున్నారు. చీటీలు రాసిచ్చి ఫలానా బుక్సెంటర్, బట్టల షాపు, షూ దుకాణాల్లో నే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. కమీషన్ల కోసం తల్లి దండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు. నిబంధన ల ప్రకారం విద్యా సంస్థల్లో చదువు తప్పితే ఎలాంటి వస్తువులు విక్రయించరాదు. విద్యాశాఖ అధికా రుల పర్యవేక్షణ లోపం, అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని యాజమాన్యాలు తమవ్యాపారాన్ని సాఫీగా కానిచ్చేస్తున్నాయి.
మితిమీరుతున్న ప్రైవేట్ ఆగడాలు..
జిల్లాలో 162 ప్రైవేట్, రెండు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కొన్నింటి ఆగడాలు మి తిమీరుతున్నాయి. తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఫీజుల వసూలుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బడిలోనే అన్ని విక్రయిస్తున్నారు. నియంత్రించాల్సిన విద్యాశాఖ ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
సూపర్ మార్కెట్ను తలపించేలా..
పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో నిల్వ ఉంచిన నోట్బుక్లను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫిర్యాదు చేస్తే తప్పా తనిఖీలు చేపట్టడం లేదు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ దందా సాగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నామ్కే వాస్తేగా సీజ్ చేయడం, తర్వాత వారితో మిలాఖతై జేబులు నింపుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు ఫీజులు సైతం నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలల్లో విక్రయాలు చేపట్టొద్దు
ప్రైవేట్ పాఠశాలల్లో నోట్ బుక్లు, పాఠ్య పుస్తకాలు, టై, బెల్టు, షూ వంటి వస్తువులు విక్రయించరాదు. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించే వాటిపై చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వస్తువులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు నిల్వ ఉంచిన గోదాంను సోమవారం సీజ్ చేశాం.
– శ్రీనివాస్రెడ్డి, డీఈవో